Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

కేసీఆర్‌ నిరంకుశ పాలనకు ప్రజలు త్వరలోనే స్వస్తి పలుకుతారు : కోదండరాం

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని టీజేఎస్‌ చీఫ్‌ కోదండరాం అన్నారు. కేసీఆర్‌ నియంత నిరంకుశ పాలనకు ప్రజలు త్వరలోనే స్వస్తి పలుకుతారని హెచ్చరించారు. జూన్‌ 6న ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో తెలంగాణ ఆత్మగౌరవ దీక్షకు ఉద్యమకారులు రాజకీయ పార్టీలకతీతంగా పాల్గొనాలని కోరారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌, సీఎం కేసీఆర్‌పై టీజేఎస్‌ చీఫ్‌ కోదండరాం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందన్నారు. కేసీఆర్‌ నియంత నిరంకుశ పాలనకు ప్రజలు త్వరలోనే స్వస్తి పలుకుతారని హెచ్చరించారు. ఉద్యమకారులు మరో పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. జూన్‌ 6న ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో తెలంగాణ ఆత్మగౌరవ దీక్షకు ఉద్యమకారులు రాజకీయ పార్టీలకతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆంధ్రా కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టని కోదండరాం ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కేవలం ఆంధ్రా కాంట్రాక్టర్లకే ప్రయోజనం చేకూరిందని వ్యాఖ్యానించారు. ప్రగతిభవన్‌లో ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఎర్ర తివాచీ పరుస్తున్నారని ఫైర్‌ అయ్యారు. మిగతా వారు ప్రగతి భవన్‌కు వెళితే 144 సెక్షన్‌ ద్వారా కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు. ధర్నా చౌక్‌లు ప్రభుత్వం మూయిస్తే కోర్టు ద్వారా తెరిపించామని తెలిపారు. కాళేశ్వరం ఖర్చు ఎక్కువ.. నీళ్లు తక్కువని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img