కేసీఆర్ పాలనకు, వైయస్సార్ పాలనకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలను పెంచలేదన్నారు. కేంద్రం గ్యాస్ రేట్లు పెంచినా తానే భరించారని చెప్పారు. రాజీవ్ స్వగృహ ద్వారా వైయస్సార్ ఇండ్లు కట్టిస్తే, నేడు కేసీఆర్ వాటిని అమ్మకానికి పెట్టారని అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తే, నేడు నిధులు కేటాయించకుండా ఆ పథకాన్ని ఎత్తేసే యోచనలో కేసీఆర్ ఉన్నారని దుయ్యబట్టారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తే, నేడు ఫీజు రీయింబర్స్ మెంట్ కాదు కదా స్కాలర్షిప్లకు కూడా నిధులు ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు.