జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు దేవాలయ అభివృద్ధికి తెలంగాణ సీఎం కేసీఆర్ మరో రూ.500 కోట్లు ప్రకటించారు. ఇవాళ కొండగట్టులో పర్యటించిన సీఎం కేసీఆర్.. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కొండగట్టుకు చేరుకున్న సీఎం.. ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిసరాలను పరశీలించారు. అనంతరం ఆలయంలో కలియతిరిగి అధికారులకు పలు సూచనలు చేశారు. కొండపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, సీతమ్మ కన్నీటిధార, బేతాళస్వామి ఆలయం, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలించారు.అనంతరం ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధిపై దేవాదాయశాఖ, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశంలోనే ప్రముఖ ఆంజనేయ క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మంజూరు చేసిన రూ. 100 కోట్లకు అదనంగా.. మరో రూ. 500 కోట్లు (మ్నెత్తం రూ. 600 కోట్లు) కేటాయించనున్నట్లు సీఎం వెల్లడిరచారు. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు.