తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖంపడుతోంది. గడచిన 24 గంటల్లో 696 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,32,379కు చేరింది. ఇందులో 6,18,496 మంది బాధితులు కోలుకోగా.. మొత్తం 3,735 మంది బాధితులు మృత్యువాతపడ్డారు. తాజాగా వైరస్ నుంచి 858 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి మరో ఆరుగురు మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 10,148 ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఒకే రోజు 1,05,797 కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు వివరించింది.