Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కొత్త జోనల్‌ ప్రకారమే ఉద్యోగుల విభజన: సీఎం కేసీఆర్‌

రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్త జోనల్‌ విధానం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో అందుకనుగుణంగానే ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపట్టాలని, సీఎం స్పష్టం చేశారు. జిల్లాల కలెక్టర్లు, సీనియర్‌ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్నారు. క్షేత్రస్థాయిలో పని చేస్తేనే సమగ్రాభివృద్ధి జరుగుతుందని సూచించారు. నాలుగు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి చేయాలని వారిని కేసీఆర్‌ ఆదేశించారు. భార్యభర్తలు ఒకేచోట పనిచేస్తేనే ప్రశాంతంగా పని చేయగలరని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img