రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు ములుగు ఎమ్మెల్యే సీతక్క ఓటు వేసినట్టు వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. తాను ఓటు వేసే క్రమంలో మార్కర్ గీత పేపర్ పైన పడిరది కానీ, ఎన్డీఏ అభ్యర్థి దగ్గర కాదని, పేపర్ పైన గీత పడిన కారణంగా, ఓటు చెల్లుతుందా లేదా అన్న అనుమానంతో తాను ఎన్నికల అధికారిని మరొక బ్యాలెట్ పేపర్ ఇవ్వవలసిందిగా కోరానని సీతక్క తెలిపారు.అయితే కొత్త బ్యాలెట్ పేపర్ ఇవ్వలేదని..ఇంక్ పడిన పేపర్నే బాక్స్లో వేసినట్లు వివరించారు. ఆత్మసాక్షిగా తాను వేయాల్సిన వారికే ఓటు వేసినట్లు సీతక్క చెప్పారు.