దేశవ్యాప్తంగా బంగారు వ్యాపారుల సమ్మె కొనసాగుతోంది. బంగారు ఆభరణాలకు హాల్మార్క్ వేయాలంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బంద్ను పాటిస్తున్నాయి. సింబాలిక్ స్ట్రైక్లో భాగంగా ఇవాళ ఒకరోజు దుకాణాలను మూసిఉంచారు. ఆలిండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) ఆధ్వర్యంలో ఈ బంద్ను పాటిస్తున్నాయి. తెలంగాణలోని దాదాపు 55,000 జెమ్, గోల్డ్ జ్యువెలరీ ట్రేడర్స్ తమ వ్యాపారాలను నిలిపివేశారు.బషీర్బాగ్ వద్ద నగల వ్యాపారులు ఆందోళనకు దిగారు. హాల్ మార్క్లో కొత్త నిబంధనలపై వ్యాపారుల నిరసన చేపట్టారు.