అధిక వడ్డీలు, స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడిన శిల్పా చౌదరి వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో పోలీసులు రాధికా రెడ్డిని విచారించనున్నారు. శిల్పా చౌదరి తనను మోసం చేసిందని రాధిక పోలీసులకు చెప్పారు. ఆధారాలతో పోలీసుల ముందుకు వస్తానని వెల్లడిరచారు. కేసులో నార్సింగి పోలీసులు మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే రెండు రోజుల కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. కస్టడీ ముగియడంతో పోలీసులు తిరిగి జైలుకు పంపించారు. మిగతా కేసులో పోలీసులు కస్టడీ కోరనున్నారు.