సీఎం కెసిఆర్ నేడు మహారాష్ట్రలోని కొల్హాపూర్లో మహలక్ష్మీ అమ్మవారిని కుటుంబ సమేతంగా సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కోల్హాపూర్ బయలుదేరారు. దర్శనం అనంతరం సాయంత్రం హైదరాబాద్ తిరుగుపయనం కానున్నారు. అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఏడోదైన కొల్హాపూర్ మహాలక్ష్మీ ఆలయాన్ని ప్రతియేటా లక్షలాది భక్తులు దర్శించుకుంటారు.