కరోనా నుండి కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని, కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. ఆరోగ్య తెలంగాణ’ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కల అని, ఈ కలను సాకారం చేయడం కోసం అందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆయుష్ ఫార్మాసిస్ట్ సెంట్రల్ ఫోరం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను మంత్రి హరీశ్ రావు సోమవారం నాడు కోకాపేటలోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫోరం అధ్యక్షులు ప్రకాష్ రావు, జనరల్ సెక్రటరీలు జయ ప్రకాష్ రెడ్డి, సుధారాణి, కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మోహన్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.