: మంత్రి ఎర్రబెల్లి
హసన్ పర్తి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం మంత్రి ఎర్రబెల్లి హసన్ పర్తి శాసనసభ సభ్యులు ఆరురి రమేష్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలసి కొవిడ్ ప్రచార వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు. కొవిడ్ ప్రచార వాహనాల ద్వారా కొవిడ్ టీకాలు వేగవంతం చేయడానికి, కరోనా నియంత్రణకై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కలుగుతుందని చెప్పారు. కేర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో జిల్లా కు 12 కొవిడ్ వాహనాలు అందించడంపై సంస్థ ప్రతినిధులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెఓ డాక్టర్ మదన్ మోహన్, డిప్యూటీ డిఎంహెఓ డాక్టర్ యాకుబ్ పాష తదితరులు పాల్గొన్నారు.