అంతర్జీతీయ స్థాయిలో క్రెడిట్ కార్డుల మోసానికి పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసుల అరెస్టు చేశారు. ఈ మేరకు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశంలో మాట్లాడారు. కొనేళ్లుగా నిందితులు క్రెడిట్ కార్డుల పేరుతో మోసం చేస్తున్నారు. లావాదేవీలు అనుమానాస్పదంగా ఉండడంతో కేసు నమోదు చేశామని సీపీ తెలిపారు. దిల్లీ, మొహాలీ, గాజయబాద్ నుండి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని అన్నారు. ‘అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను ముఠా క్లోనింగ్ చేస్తోంది. మొహాలీ, పంజాబ్కు చెందిన ఏడుగురు ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాకు చెందిన నవీన్ బొటాని కీలక సూత్రధారిగా ఉన్నాడు. విదేశాల్లో ఉన్నవారికి క్రెడిట్ కార్డులను ముఠా సప్లై చేస్తుంది. ఆన్లైన్ ద్వారా ముఠా క్రెడిట్ కార్డులను అమ్ముతోంది.’ అని చెప్పారు. ఇప్పటి వరకు 50 కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్లు గుర్తించాము. నకిలీ కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి 80 మందితో ఈ ముఠా కార్యకలాపాలు కొనసాగిస్తుంది. డార్క్ వెబ్ సైట్, గూగుల్ యాడ్స్ ద్వారా సమాచారాన్ని తీసుకొని, బల్క్ ఎస్ఎమ్ఎస్ లు పంపి ట్రాప్ చేస్తున్నారు. దుబాయ్లో మరో రెండు ముఠాలు ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు ముఠా నుండి కోటి పదకొండు లక్షలు నగదు, స్వాధీనం చేసుకున్నామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.