తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులతో కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశించారు. గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలన్నారు. గంజాయి నిర్మూలనకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఎంతో ఆవేదనతో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. గంజాయిపై యుద్ధం ప్రకటించాలన్నారు. పరిస్థితి తీవ్రం కాకముందే గంజాయి అక్రమ సాగు అరికట్టాలన్నారు.గంజాయిని నిరోధించేందుకు డీజీ స్థాయి అధికారిని నియమించి.. ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యాసంస్థల దగ్గర ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. సరిహద్దుల్లో చెక్పోస్టుల సంఖ్యను పెంచాలని ఆదేశించారు.