Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

గంజాయి మత్తులో యువకుల వీరంగం.. పోలీస్‌ వాహనం పైకెక్కి నానా బీభత్సం

హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో అర్ధరాత్రి యువకులు నానా హంగామా చేశారు. జిర్రా సమీపంలోని రాయల్స్‌ హోటల్‌ వద్ద గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. నడిరోడ్డుపై వాహనదారులకు తీవ్ర ఆటంకం కలిగించారు. ఈ క్రమంలోనే అక్కడికి పోలీసులపై కూడా దాడికి తెగబడ్డారు. వివరాల్లోకి వెళితే, మెహిదీపట్నంలోని ఆసిఫ్‌నగర్‌లో సోమవారం అర్ధరాత్రి యువకులు వీరంగం సృష్టించారు. జిర్రా ప్రాంతంలోని రాయల్సీ హోటల్‌ దగ్గర యువకులు గంజాయి తాగి హల్‌చల్‌ చేశారు. గంజాయి మత్తులో వాహనదారులపై దాడులు చేశారు. దీంతో కొందరు వాహనదారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వారు చేరుకున్నారు. ఈ క్రమంలోనే యువకులను అడ్డుకోబోయిన పోలీసులపై కూడా దాడికి దిగారు. ఓ యువకుడు పోలీసు వాహనంపైకి ఎక్కి నానా హంగామా సృష్టించాడు. పలు వాహనాల అద్దాలను మిగతా యువకులు పగులగొట్టారు. దీంతో గంజాయి గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు దేహశుద్ధి చేశారు. అజయ్‌ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. గంజాయి సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img