Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం

హైదరాబాద్‌ నగరంలోని గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హెచ్‌సీయూ రోడ్డులో అతివేగంతో వెళ్లిన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్నది.ప్రమాదంలో కారు రెండు ముక్కలైంది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతిచెందిన వారిలో ఇద్దరు జూనియర్‌ ఆర్టిస్టులు, కార్‌ డ్రైవ్‌ చేస్తున్న ఓ బ్యాంకు ఉద్యోగి మృతిచెందారు. మరో జూనియర్‌ ఆర్టిస్టు సిద్దుకు గాయాలయ్యాయి. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. గాయపడిని వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను జూనియర్‌ ఆర్టిస్టులు ఎం. మానస, ఎన్‌.మానసగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img