Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి

గవర్నర్‌ కోటా నామినెటేడ్‌ ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి శానసమండలికి ప్రాతినిధ్యం వహించనున్నారు. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న శ్రీనివాస్‌ రెడ్డి పదవీకాలం ఈ ఏడాది జూన్‌ 16వ తేదీతో ముగియడంతో ఆయన స్థానంలో మధుసూదనాచారి పేరును ప్రతిపాదిస్తూ రాష్ట్ర మంత్రివర్గం చేసిన సిఫారసును గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ఆమోదించారు.సిరికొండ మధుసూదనాచారిని మండలికి నామినేట్‌ చేశారు.ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇవాళ్టి నుంచి మధుసూదనాచారి పదవీకాలం ప్రారంభం కానుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు వెలువరించింది. కాగా గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిరికొండ మధుసూదనాచారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img