Friday, April 19, 2024
Friday, April 19, 2024

గాంధీ కుటుంబంపై కేంద్రం అక్రమ కేసులు

సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీపై కేసులు పెట్టడం దుర్మార్గమని టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అన్నారు.సోనియా కుటుంబంపై ఈగ వాలినా సహించేది లేదని హెచ్చరించారు. గాంధీ కుటుంబంపై కేంద్రం అక్రమ కేసులు పెట్టిందని ఆరోపించారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను బ్రిటీషర్లు నిషేధించారని రేవంత్‌రెడ్డి అన్నారు.స్వాతంత్య్ర పోరాటంలో నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కీలకపాత్ర పోషించిందన్నారు. దేశ సమగ్రత కోసం పత్రికను మళ్లీ నడపాలని నిర్ణయించారని,పత్రిక నష్టాల్లో ఉంటే కాంగ్రెస్‌ రూ.90 కోట్లు ఇచ్చిందని రేవంత్‌రెడ్డి తెలిపారు. బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించడానికి పత్రిక నడుస్తోందన్నారు.2015లో ముగిసిన విచారణను మోదీ సర్కార్‌ మళ్లీ తెరపైకి తెచ్చిందన్నారు.సోనియా, రాహుల్‌ గౌరవాన్ని తగ్గించే కుట్ర చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రంతీరును ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్దిచెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img