Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

గీత కార్మికులకు బీమా పాలసీ తీసుకొస్తాం

: మంత్రి హరీశ్‌రావు
గీత కార్మికుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు.మంగళవారం ఇల్లందకుంట మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జరిగిన గౌడ కులస్తుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, హౖదరాబాద్‌లో కల్లు డిపోలు తెరవడం వల్ల లక్ష మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు..కల్లు ఆరోగ్యానికి మంచిదని భావించి.. హైదరాబాద్‌ లో నీరా షాపులు ఓపెన్‌ చేస్తున్నాం. కరోనా రాకపోతే ఇప్పటికే అన్ని జిల్లాల్లో ప్రారంభించేవాళ్లమని ఆయన వివరించారు.రైతు బీమా తరహాలో గీత కార్మికుల బీమా తీసుకురాబోతున్నాం. ఇదే తరహాలో మత్స్య, చేనేత కార్మికుల బీమా కూడా తేవాలని సీఎం ఆలోచిస్తున్నారని మంత్రి తెలిపారు. పల్లె ప్రకృతి వనాల్లో భాగంగా ఈత, తాటి వనాలు పెంచుతున్నామని అన్నారు. ఎండమావిలాంటి బీజేపీ వైపు వెళ్లే బదులు అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని మంత్రి కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img