Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

గురుకులాలు, డిగ్రీ కళాశాల ఏర్పాటుపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం

బీసీల కోసం కేటాయించిన నూతన గురుకులాలు, డిగ్రీ కాలేజీల ప్రారంభానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. జిల్లాకు ఒకటి చొప్పున 33 నూతన గురుకులాలు అక్టోబర్‌ 11 నుంచి, నూతన డిగ్రీ కళాశాలలను అక్టోబర్‌ 15 నుంచి ప్రారంభించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం గురుకులాలు, డిగ్రీ కళాశాల ఏర్పాటుపై మంత్రి తన నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అత్యున్నత స్థాయి ప్రమాణాలతో వీటిని నెలకొల్పుతున్నామని, స్థలాల గుర్తింపు బాధ్యతను స్థానిక జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గతంలో సీఎం హామీనిచ్చిన విధంగా హాలియా, దేవరకద్ర, కరీంనగర్‌, సిరిసిల్ల, వనపర్తితో పాటు పాత జిల్లాల ప్రతిపాదికగా ప్రతి జిల్లాలో డిగ్రీ కాలేజీలను ప్రారంభించాలన్నారు. ఈ నూతన గురుకులాలతో మొత్తం బీసీ గురుకులాల సంఖ్య 310కి చేరింది.కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎంజేపీ సొసైటీ సెక్రటరీ మల్లయ్యబట్టు, బీసీ స్టడీ సర్కిల్స్‌ డైరెక్టర్‌ అలోక్‌ కుమార్‌, బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు సంధ్య, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img