తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీల్లో చదివిన విద్యార్థులు ఎంబీబీఎస్ మొదటి రౌండ్ కౌన్సెలింగ్లో 190 మంది మెడికల్ సీట్లు పొందడం అభినందించదగ్గ విషయమని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆం ప్రశంసల జల్లు కురిపించారు.గత ఆరేండ్లలో 512 మందికి పైగా విద్యార్థులు మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందారు. ఈ సందర్భంగా ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆ శాఖ బృందానికి కేటీఆర్ అభినందనలు తెలపుతూ ట్వీట్ చేశారు.