Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

గౌత‌మ బుద్ధుని జ్ఞాన‌మార్గం నేటి స‌మాజానికి ఎంతో అవ‌స‌రం : సీఎం కేసీఆర్

బుద్ధ పూర్ణిమ సంద‌ర్భంగా ప్ర‌జ‌లంద‌రికీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. బుద్ధుని ఆశ‌యాల‌కు కార్య‌రూప‌మిస్తూ ప్ర‌భుత్వం ఘ‌న నివాళుల‌ర్పిస్తోంది అని పేర్కొన్నారు. బుద్ధుని బోధ‌న‌లు, కార్యాచ‌ర‌ణ‌ను కేసీఆర్ స్మ‌రించుకున్నారు. గౌత‌మ బుద్ధుని జ్ఞాన‌మార్గం నేటి స‌మాజానికి ఎంతో అవ‌స‌రం అని అన్నారు. తెలంగాణ గ‌డ్డ మీద బౌద్ధం ప‌రిఢ‌విల్ల‌డం మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అభివృద్ధి చేసిన బుద్ధ‌వ‌నం ప్ర‌పంచ ప‌ర్యాట‌కులను ఆక‌ర్షిస్తోంది. తెలంగాణ ప్ర‌జ‌లు సుఖ‌సంతోషాల‌తో జీవించేలా పాల‌న కొన‌సాగిస్తున్నామ‌ని కేసీఆర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img