మంత్రి కేటీఆర్ను ప్రగతి భవన్లో ఇవాళ గ్రిడ్ డైనమిక్స్ సీఈవో లివ్ చిట్జ్తో పాటు ఆ కంపెనీ ప్రతినిధులు కలిశారు. మల్టీ నేషనల్ కంపెనీలకు హైదరాబాద్ కేంద్రంగా నిలిచిందని ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. గ్రిడ్ డైనమిక్స్ భారత్లో మొదటి యూనిట్ను ఏర్పాటు చేస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ యూనిట్ ఏర్పాటుతో హైదరాబాద్లో వెయ్యి మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.