తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గ్రూప్ 4 నోటిఫికేషన్ను విడుదల చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్కి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. వివిధ శాఖలకు చెందిన 9,168 ఉద్యోగాలను గ్రూప్ 4 పరీక్షల ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, గ్రూప్ 4 ద్వారా వార్డు అధికారుల నియామకం ఓ వినూత్న చర్య అని ప్రశంసించారు. గ్రూప్ 4 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 141 మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ల నియామకం జరుగుతుందన్నారు. దీంతో పౌర సమస్యలపై మరింత దృష్టి సారించే అవకాశం కలుగుతుందని%ౌౌ% కౌన్సిలర్లతో వార్డు అధికారులకు మంచి సమన్వయం నెలకొంటుందని తెలిపారు.