Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఘనంగా టీఆర్‌ఎస్‌ జెండా పండుగ

రాష్ట్రవ్యాప్తంగా గులాబీ జెండా పండుగను గురువారం టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. రాష్ట్రవ్యాప్తంగా పల్లెపల్లెనా, పట్టణాల్లో వార్డు వార్డునా టీఆర్‌ఎస్‌ నేతలు గులాబీ జెండాను ఎగుర వేసి జెండాపండుగను అట్టహాసంగా నిర్వహించారు.తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ నేత పర్యాద కృష్ణమూర్తి గులాబీ జెండాను ఎగుర వేశారు.అనంతరం మిఠాయిలు పంచి పెట్టారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జరిగిన వేడుకల్లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొని, టీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించారు. 4వ, 23, 24వ వార్డుల్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు.నల్లగొండ జిల్లాలో జరిగిన వేడుకల్లో మాజీ శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 48వ వార్డులో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన జెండా పండుగలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు. సంగారెడ్డిలో జరిగిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి హాజరయ్యారు. నర్సంపేట పట్టణంలో టీఆర్‌ఎస్‌ జెండా జెండాను స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఎగురవేశారు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ టీఆర్‌ఎస్‌ జెండాను ఎగుర వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img