Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

చలాన్‌ విధించిన ట్రాఫిక్‌ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌కు మంత్రి అభినందన

రెండు రోజుల క్రితం తన వాహనానికి చలాన్‌ వేసిన ఎస్‌ఐ ఐలయ్య, కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం అభినందించారు.రాంగ్‌ రూట్‌లో వచ్చిన మంత్రి వాహనానికి సైతం నిబంధనల ప్రకారం.. చలాన్‌ విధించిన ట్రాఫిక్‌ సిబ్బందిని మంత్రి తన కార్యాలయానికి పిలిపించి సన్మానించారు. సామాన్య ప్రజలు సామాన్య ప్రజలు అయినా.. అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులైనా.. నిబంధనలు అందరికీ ఒక్కటే అన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడంలో తాను ఎల్లవేళలా ముందుంటానని.. చలాన్‌ విధించిన రోజు వాహనంలో తాను లేనని మంత్రి పేర్కొన్నారు. వాహనానికి నిబంధనల ప్రకారం చలాన్‌ విధించిన ఎస్‌ఐ ఐలయ్య, కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి సత్కరించారు. విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించే ఐలయ్య లాంటి అధికారులకు ఎప్పుడూ తాము అండగా ఉంటామని చెప్పారు. మంత్రి కేటీఆర్‌ తన వాహనానికి విధించిన చలాన్‌ను సైతం చెల్లించారు.ఇవాళ ట్రాఫిక్‌ సిబ్బందిని అభినందించిన విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తించాలని మంత్రి సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img