వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు..షర్మిల కీలక వ్యాఖ్యలు
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆమె.. వివేకా హత్యకేసును ప్రస్తావించగా తన అభిప్రాయాన్ని చెప్పారు. తన కుటుంబంలో జరిగిన ఘోరమైన ఘటన అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ చిన్నాన్నను అంత ఘోరంగా ఎవరు హత్య చేశారో.. వాళ్లకి శిక్ష పడాలన్నారు. దర్యాప్తును ఎవరు అడ్డుకోవడానికి వీల్లేదని.. సునీతకు న్యాయం జరగాలని ఆకాంక్షించారు షర్మిల.