ఒకరి మృతి, మరొకరికి సీరియస్
స్కూలు బస్సు రూపంలో చిన్నారులపైకి మృత్యువు దూసుకొచ్చింది. స్కూలుకి వెళ్లడానికి సిద్ధమైన ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి మృతదేహంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని శేరిగుడలో చోటుచేసుకుంది. నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులపై ఇబ్రహీంపట్నానికి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల స్కూల్ బస్ దూసుకెళ్లింది. ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి మృతదేహంతో బంధువులు రోడ్డుపై బైటాయించగా.. తీవ్రగాయాలతో ఉన్న విద్యార్థిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వ్యాన్ డ్రైవర్పై కేసు నమోదు చేశారు.