100 మందిలో ఏడుశాతం శిశువుల్లో లోపాలుంటాయని, వాటిని టీఫా స్కాన్స్తోనే గుర్తించడం సాధ్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సర్కారు దావాఖానల్లో గర్భిణుల సౌకర్యార్థం కొత్తగా ఏర్పాటు చేసిన టిఫా స్కానింగ్ మిషన్లను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన 56 టిఫా స్కానింగ్ యంత్రాలను పేట్ల బురుజు ఆసుపత్రి నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.