ప్రభుత్వం చేనేత హస్త కళాకారులకి చేయూతను అందిస్తుంది అని సీఎస్ సోమేశ్ కుమార్ చెప్పారు. హైదరాబాద్ శిల్పారామం మాదాపూర్ లో ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళ ముగింపు సంబరాల్లో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. నేషనల్ అవార్డ్ వచ్చిన చేనేత హస్త కళాకారులను ఆయన సన్మానించారు.వివిధ రాష్ట్రాలనుండి విచ్చేసిన చేనేత హస్త కళాకారులను ఆయన కలిసి కళా ఉత్పత్తులను అడిగి తెలుసుకున్నారు.