Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జంట నగరాల పరిధిలోని ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌

రూ.100కే రోజంతా సిటీ ప్రయాణం
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్‌ జంట నగరాల పరిధిలోని ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. టీ-24 (ట్రావెల్‌ 24 అవర్స్‌) పేరిట రూ.100కే ఒకరోజు పాస్‌ జారీ చేయనున్నట్టు ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు. ఒక రోజంతా జంటనగరాల పరిధిలో ఏ ప్రాంతానికైనా సిటీ ఆర్డినరీ, సబర్బన్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌ బస్సుల్లో ఎన్నిసాట్కర్లెనా ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ టికెట్‌పై ప్రయాణికుల్లో అవగాహన పెంచేందుకు ఉన్నతాధికారులు, డిపోమేనేజర్లు విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. గ్రేటర్‌లో ప్రతిరోజూ 29 డిపోల పరిధిలో సుమారు 6 వేల వరకు ట్రావెల్‌ 24 టికెట్లు ప్రయాణికులు తీసుకుంటుండగా వీటిని రెట్టింపుచేయాలని ఆర్టీసీ భావిస్తోంది.ఇక ఆర్టీసీ బస్సులోకానీ, బస్‌స్టేషన్‌ ప్రాంగణంలోకానీ గుట్కా, ఖైనీ, పాన్‌మసాలా వంటివి వాడకూడదని ఎండీ సజ్జనార్‌ ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రీజినల్‌ మేనేజర్లు, డివిజినల్‌ మేనేజర్లు, డిపో మేనేజర్లకు ఆదేశించారు. కొందరు డ్రైవర్లు, ప్రయాణికులు పాన్‌, గుట్కా, పాన్‌మసాలా వంటివి నమిలి బస్సులో, బయట ఉమ్మడం సరైంది కాదని, ఇది సంస్కారవంతులు చేసే పనికాదని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img