తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లాలో కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని మధ్యాహ్నం ప్రారంభించారు. రూ. 58.20 కోట్లతో..25 ఎకరాల్లో ఈ సమీకృత కలెక్టరేట్ భవనాన్ని నిర్మించారు.జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రశాంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నాయకులు పాల్గొన్నారు. అనంతరం జనగామ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. జనగామ పరిధి యశ్వంత్పూర్ వద్ద పార్టీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు.