జనగామజిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అటు చీటకోడూరు రిజర్వాయర్లోకి వరద పోటెత్తింది. దీంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేశారు. భారీగా వర్షాలకు కుందారం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కుందారం పరిసర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వడ్లకొండ ఊర చెరువు మత్తడి పోస్తోంది. వడ్లకొండ – హుస్నాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జనగామ పట్టణంలో రంగప్ప చెరువు మత్తడి పోస్తోంది. భారీ వర్షాల కారణంగా ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.