: మంత్రి కేటీఆర్
జనపనార మిల్లును ఏర్పాటు చేసేందుకు మూడు కంపెనీలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. రెండు వరి పంటల మధ్యన మూడో పంటగా జనుము పంటను పండిచేందుకు తెలంగాణ ప్రభుత్వం వీలు కల్పిస్తుందన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా జనపనార మిల్లుల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. వరంగల్ జిల్లాలో గ్లాస్టర్ లిమిటెడ్ అనే కంపెనీ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంబీజీ కమాటెడిస్ అనే కంపెనీ, కామారెడ్డి జిల్లాలో కాళేశ్వరం అగ్రో కంపెనీ జనపనార మిల్లులను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ మూడు కంపెనీలు కలిపి రూ. 887 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. 10,480 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రౖౖెతులు ఉత్పత్తి చేసిన జనుమును ఈ పరిశ్రమలు కొని, వారు ఉత్పత్తి చేసిన గోనే సంచులను ప్రభుత్వం కొనేందుకు ఒక కార్యాచరణ రూపొందించామని తెలిపారు. జనుము మన దగ్గర పండటం లేదు. బీహార్, బంగ్లాదేశ్ నుంచి జనుమును దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే జనుము రవాణాపై సబ్సిడీ కూడా ఇస్తున్నామని తెలిపారు. మన రాష్ట్రంలో కూడా జనుము పంటను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నాం. రైతులకు దీనిపై అవగాహన కల్పిస్తామన్నారు.