కొత్త సంవత్సరం సందర్భంగా పన్నెండేళ్లలోపు చిన్నారులు జనవరి 1న (శనివారం) బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ మేనేజింగ్ డైరక్టర్ వీసీ సజ్జనార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు విధిగా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు వారితో ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ బస్సులోనైనా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని అన్నారు.