Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జర్నలిస్టులకు ఇళ్లు, స్థలాలు కేటాయించాలి

విశాలాంధ్ర`నాగారం : మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ (టీడబ్ల్యూజెఎఫ్‌) మేడ్చల్‌ నియోజకవర్గ సమా వేశం తీర్మానించింది. ఆదివారం నాగారంలోని సెరినిటీ మోడల్‌ హై స్కూల్‌లో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశానికి జిల్లా అధ్యక్షులు తన్నీరు శ్రీనివాస్‌ అధ్యక్షత వహించారు. సమావేశానికి ఐఎఫ్‌డబ్ల్యూజె జాతీయ కౌన్సిల్‌ సభ్యులు మెరుగు చంద్ర మోహన్‌, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు బెలిదే అశోక్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంపల్లి పద్మారెడ్డి జిల్లా కార్యదర్శి యావపురం రవి, కోశాధికారి కళ్యాణ చక్రవర్తిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేడ్చల్‌ నియోజక వర్గ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బుర్ర శ్రీధర్‌ ఉపా ధ్యక్షులుగా జి.పరుశురాం, ప్రధాన కార్యదర్శిగా యాట రాజు, సంయుక్త కార్యదర్శులుగా కీసర రవికుమార్‌, ఎం.విష్ణు మోహన్‌, ఆర్గ నైజింగ్‌ కార్యదర్శులుగా బి.దినకర్‌, ఆవుల భాస్కర్‌ రావు, కోశాధికా రిగా ఆర్‌.సతీష్‌ గౌడ్‌ను ఎన్నుకున్నారు. ఇటీవల జిల్లా కమిటీ ఉపాధ్య క్షులుగా ఎన్నికైన నరసింహులు, సంయుక్త కార్యదర్శి టి.రమేష్‌, ఆర్గనై జింగ్‌ కార్యదర్శి వి.రాములతో పాటు నూతన కార్యవర్గాన్ని సన్మానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img