Friday, April 19, 2024
Friday, April 19, 2024

జలదిగ్బంధంలో భైంసా


తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో జలాశయాలకు వరద పోటెత్తింది. అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి నీరు వదలడంతో భైంసాలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆటోనగర్‌లోని ఇళ్లను వరదనీరు చుట్టుముట్టింది. 60 కుటుంబాలు నీటిలో చిక్కుకున్నాయి. ఈ ప్రాంతంలో మంత్రి ఇంద్రకరన్‌ రెడ్డి పర్యటించి, పరిస్థితులను తెలుసుకున్నారు. కాగా రెస్క్యూ టీం నాటు పడవలతో సహాయక చర్యలు ప్రారంభించింది. ఆటోనగర్‌, ఎన్‌ఆర్‌ గార్డెన్‌ ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img