సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయిన జస్టిస్ హిమాకోహ్లీకి తెలంగాణ హైకోర్టులో ఘనంగా వీడ్కోలు పలికారు. హైకోర్టు ప్రాంగణంలో జస్టిస్ హిమా కోహ్లీకి బార్ అసోసియేషన్ వీడ్కోలు ఏర్పాటు చేశారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు హిమాకోహ్లీకి అభినందనలు తెలిపారు. ఇటీవల తొమ్మిది మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం సిఫార్సులపై రాష్ట్రపతి కోవింద్ ఆమోదముద్ర వేసిన వేసిన విషయం తెలిసిందే.