Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

జాతీయ డీఎన్‌ఏ డేటాబేస్‌ ఏర్పాటు చేయాలి

హైదరాబాద్‌ : దేశంలో డీఎన్‌ఏ డేటా బేస్‌ అమలు విజయవంతం అయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. డీఎన్‌ఏ టెక్నాలజీ బిల్లు ప్రస్తుతం పార్లమెంట్‌లో పెండిరగ్‌లో ఉంది. సంబంధిత ప్రైవసీ, డేటా సెక్యూరిటీ అంశాల గురించి నిపుణులు ఈ సందర్భంగా చర్చించారు. డేటా రక్షణకు వీలు కల్పించేలా బిల్లులో ఉన్న నియంత్రణ ఏర్పాట్లను వారు ప్రస్తావించారు. భారతదేశంలో ప్రస్తుతం డీఎన్‌ఏ టెస్టింగ్‌ చాలా తక్కువ రేటుగా ఉంది. పరిమితస్థాయిలోనే అది జరుగు తోంది. బయోటెక్నాలజీ విభాగం ప్రకారం, సుమారుగా 15- 18 దాకా ఉన్న ఫోరెన్సిక్‌ లేబొరేటరీలలో సు మారుగా 30-40 మంది డీఎన్‌ఏ నిపుణులు ఏడాదిలో సుమారుగా 3000 కేసులు చేపడుతుంటారు. అంటే డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌ కోసం అవసరమైన మొత్తంలో 2-3 శాతం మాత్రమే జరుగుతోంది. ప్రాంతీయ, జా తీయ స్థాయిలో ఉండే డీఎన్‌ఏ డేటా బేస్‌ నేర నిరూపణ నాణ్యతను మెరుగుపర్చడంలో తోడ్పడుతుంది. పెండిరగ్‌ కేసులను తగ్గించడంలో న్యాయవ్యవస్థకు సహాయపడుతుంది. శాస్త్రీయ ఆధారాలతో కేసులను పరిష్కరించడంలో వాటి సామర్థ్యాన్ని అధికం చేస్తుందని ఈ సందర్భంగా సెంటర్‌ ఫర్‌ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నస్టిక్స్‌ (సీడీఎఫ్‌ డి) (హైదరాబాద్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ కుమారస్వామి తంగరాజ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img