Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జాతీయ సగటును మించి రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌

మంత్రి హరీశ్‌రావు
రాష్ట్రంలో జాతీయ సగటును మించి వ్యాక్సినేషన్‌ పూర్తయిందని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. మంత్రి హరీష్‌ రావు గురువారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, టీకాలు, కొత్త మెడికల్‌ కాలేజీలు, కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం, వరంగల్‌లోని మల్టీ సూపర్‌ స్పెషాల్టీ ఆసుపత్రి నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని హరీష్‌రావు ఆదేశించారు.టిమ్స్‌ ఆస్పత్రి పెండిరగ్‌ బకాయిలు చెల్లిస్తామన్నారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామని హరీష్‌రావు తెలిపారు. అధికారులతో చర్చించిన అనంతరం పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. అంతకుముందు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్‌ మాండవీయతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీష్‌ రావు, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్టంలో కరోనా కేసులు, వ్యాక్సినేషన్‌ కార్యక్రమం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, సీఎం ఓఎస్డీ గంగాధర్‌, డీఎంఈ రమేశ్‌రెడ్డి, కాలోజీ వర్సిటీ వీసీ కరుణాకర్‌ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img