Friday, April 19, 2024
Friday, April 19, 2024

జింఖానా తొక్కిసలాట ఘటనపై అజారుద్దీన్‌ పై కేసు

టీ20 మ్యాచ్‌ టికెట్ల కోసం జింఖానా మైదానం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) నిర్లక్ష్యం ఉందని, హెచ్‌ సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌ సహా నిర్వాహకులపై కేసు నమోదైంది. ఈ నెల 25న హైదరాబాద్‌లో జరగనున్న భారత్‌-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌ టికెట్ల అమ్మకాలకు సంబంధించి జింఖానా గ్రౌండ్‌లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన అదితి ఆలియా, ఎస్‌ఐ ప్రమోద్‌ బేగంపేట స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సెక్షన్‌ 420, సెక్షన్‌ 21, సెక్షన్‌ 22/76 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడిరచారు. టీ20 మ్యాచ్‌ టికెట్లను బ్లాక్‌లో అమ్ముకున్నారంటూ అజారుద్దీన్‌పై ఆరోపణలు వచ్చాయి. టికెట్ల అమ్మకంలో సరైన జాగ్రత్తలు పాటించలేదని, అందువల్లే తొక్కిసలాట జరిగిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అజారుద్దీన్‌ బాధ్యతా రాహిత్యం వల్లే ఇదంతా జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. టికెట్ల కోసం గురువారం జింఖానా మైదానానికి వేలాదిగా వచ్చిన అభిమానులు ఒక్కసారిగా టికెట్ల కౌంటర్‌ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వారిని వెంటనే సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img