: బండి సంజయ్
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు.జీతాలు ఇవ్వలేని సీఎం.. ఇప్పుడు దళిత బంధు ఇస్తాడా? అని ప్రశ్నించారు.రోడ్లు, కరోనా వ్యాక్సిన్, బియ్యం, హరితహారం(కంపా), ఇలా ప్రతి దానికీ పైసలు ఇచ్చేది కేంద్రమే అని తెలిపారు. కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్రూం ఇళ్ళు ఎప్పటికీ రావన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎన్ని డబుల్ బెడ్ రూమ్లు ఇచ్చారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.