Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

జూన్ 9న చేప ప్రసాదం పంపిణీ..

  • జూన్ 9వ తేదీన హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. నాంపల్లి గ్రౌండ్ లో దీని కోసం భారీగా ఏర్పాట్లు చేయనున్నారు. తరతరాలుగా బత్తిన కుటుంబీకులు ఈ చేప ప్రసాదాన్ని ప్రతియేటా క్రమం తప్పకుండా ప్రజలకు ఉచితంగా ఈ ప్రసాదాన్ని అందజేస్తున్నారు. కరోనా సమయంలో మినహా ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. ఆస్తమా రోగులకు విశేష ఔషదంగా ఈ చేప ప్రసాదం పనిచేస్తుందని ప్రజల్లో బలమైన నమ్మకం.ఇక ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీ కోసం బత్తిన కుటుంబంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేడు సమావేశమయ్యారు. ఈ ఏర్పాట్లపై ఆయనతో విస్తృతంగా చర్చించారు. వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఈసందర్భంగా తలసాని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img