జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసు నిందితుడు సాదుద్దీన్ మాలిక్ 3 రోజుల కస్టడికి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది..సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ఆరుగురు నిందితుల్లో సాదుద్దీన్ మాలిక్ ఒక్కడే మేజర్. దీంతో అతడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కోర్టు విచారణ జరిపి మూడు రోజులపాటు కస్టడీకి అనుమతించింది.