Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేపు కేసు..జువైనల్‌ హోంలో ఒకర్నొకరు కొట్టుకున్న నిందితులు

జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేపు కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లు జువైనల్‌ హోంలో కొట్టుకున్నారు. వీరు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వంటే నువ్వేనంటూ ఐదుగురు మైనర్లు ఒకరిపై ఒకరు ప్లేటతో దాడి చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. బాలికను ట్రాప్‌ చేద్దామని నువ్వే అన్నావని కార్పొరేటర్‌ కుమారుడు టార్గెట్‌గా ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. అతణ్ని టార్గెట్‌ చేసుకుని మిగిలిన నలుగురు దాడి చేశారు. అతను తిరగబడి వీరిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. చివరకు పోలీసులు, జువైనల్‌ హోం అధికారుల జోక్యంతో వారికి సర్ది చెప్పి ఈ వివాదం సద్దుమణిగేలా చేసినట్లుగా సమాచారం. ఈ ఘటనతో నిందితులు ఉన్న జువెనైల్‌ హోమ్‌ కు పోలీసులు భద్రత పెంచారు.
ఏ – 1 సాదుద్దీన్‌కి ముగిసిన పోలీసుల కస్టడీ
జూబ్లీహిల్స్‌ మైనర్‌ బాలికపై గ్యాంగ్‌రేప్‌ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ మలిక్‌ పోలీసుల కస్టడీ ముగిసింది. ఈ రోజు ఉదయం ఏ – 1 అయిన సాదుద్దీన్‌ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా మలిక్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. అనంతరం నిందితుడిని పోలీసులు చంచల్‌ గూడ జైలుకు తరలించారు. కస్టడీ చివరి రోజైన నిన్న పోలీసులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img