Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా శంభీపూర్‌ రాజు ప్రమాణస్వీకారం

టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీగా శంభీపూర్‌ రాజు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ అమీనుల్‌ హసన్‌ జాఫ్రీ ప్రమాణస్వీకారం చేయించారు. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల నుంచి శంభీపూర్‌ రాజు ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, మహముద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img