Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

టీఆర్‌ఎస్‌ నేతలు గంగుల, రవిచంద్రకు సీబీఐ నోటీసులు

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ నేతలపై ఈడీ, సీబీఐ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మంత్రి గంగుల కమలాకర్‌, టీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు సీబీఐ నోటీసులు అందించింది. ఢల్లీిలో అరెస్ట్‌ అయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్‌ కు చెందిన కేసులో నోటీసులు అందజేసింది. ఈ ఉదయం కరీంనగర్‌ లో గంగుల ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో గంగుల లేకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు. రేపు ఢల్లీిలో విచారణకు హాజరుకావాలని సీబీఐ ఆ నోటీసుల్లో పేర్కొంది. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్‌ ను సీబీఐ అధికారులు రెండు రోజుల క్రితం అరెస్ట్‌ చేశారు. గంగుల, రవిచంద్రతో శ్రీనివాస్‌ కలిసున్న ఫొటోలను సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరికీ నోటీసులు జారీ చేశారు. ఫోన్‌ డేటా ఆధారంగా సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img