Friday, April 19, 2024
Friday, April 19, 2024

టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కేసీఆర్‌ ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ రాష్ట్రసమితి (టీఆర్‌ఎస్‌) అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైటెక్స్‌లో జరుగుతున్న పార్టీ ప్లీనరీలో ఎన్నికల అధికారి శ్రీనివాసరెడ్డి కేసీఆర్‌ ఎన్నికను ప్రకటించారు. 9వ సారి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కేసీఆర్‌ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. తనను ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన అధ్యక్షోపన్యాసం చేశారు. తొలిసారి 2001లో జలదృశ్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించామన్నారు. రకరకాల అపనమ్మకాల మధ్య గులాబి జెండా ఎగిరిందని.. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూ ప్రత్యేక తెలంగాణ సాధించామని చెప్పారు. తెలంగాణ ఉద్యమం ప్రపంచ ఉద్యమాలను నిర్దేశించిందన్నారు. ఇది శాశ్వతంగా ఉండే కీర్తి అని అన్నారు. అంతకుముందు సీఎం కేసీఆర్‌ పార్టీ జెండా ఆవిష్కరించి ప్లీనరీని ఏర్పాటు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి.. అమరవీరులకు నివాళులర్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img