ఈ నెల 25 వ తేదీన జరిగే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను శనివారం పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలోనే చరిత్ర సృష్టించిన పార్టీ టీఆర్ఎస్ అని పేర్కొన్నారు. పోేరాడి సాధించుకున్న తెలంగాణలో కసీఆర్ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.