టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.ఈ నెల 25న ఉదయం 10 గంటలకు ప్లీనరీ ప్రారంభం అవుతుంది అని కేటీఆర్ తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ప్లీనరీ ప్రాంగణంలో 35 కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు.నగర ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా 50 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు.రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొదటి సెషన్ ఉంటుంది. ఈ సెషన్లో పార్టీ అధ్యక్ష ఎంపిక, కొన్ని తీర్మానాలు ఉంటాయి. రెండో సెషన్ 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో తీర్మానాలతో పాటు ఇతర కార్యక్రమాలు ఉంటాయి. మొత్తం 7 తీర్మానాలను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు భోజన విరామ సమయం ఉంటుంది. ప్లీనరీకి హాజరయ్యే ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్లీనరీకి వచ్చే ప్రతినిధులు ే గులాబీ రంగు దుస్తులు ధరంచి రావాలని ఇప్పటికే చెప్పామన్నారు. పార్టీ ఎంపిక చేసిన ప్రజాప్రతినిధులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. పాస్లు ఇవాళ సాయంత్రం వరకు అందుతాయని చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ జడ్పీ చైర్మన్లతో పాటు పార్టీ ముఖ్యులకు నియోజకవర్గాల వారీగా సమాచారం అందుతుంది. వారు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.