తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు శుభవార్త. త్వరలో టీఎస్ఆర్టీసీ స్లీపర్ క్లాస్ బస్సులను నడుపనుంది. తొలి దశలో 16 బస్సులను ప్రవేశ పెట్టనున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో వీటిని ప్రవేశ పెడతారు. స్లీపర్ బస్సులతో పాటు మొత్తం 1016 కొత్త బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. వీటిలో 300 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని మరో రెండు నగరాలకు ఈ విద్యుత్ బస్సులు ఇవ్వనున్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెన్నెల పేరుతో స్లీపర్ బస్సులుండేవి. ఆర్టీసీ విభజన సమయంలో వాటిని ఏపీకి కేటాయించారు. ఇక 1,016 కొత్త బస్సుల్లో 300 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయనున్నారు. హైదరాబాద్తో పాటు ఒకట్రెండు నగరాల్లో ఈ బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు తెలంగాణకు కేటాయించిన 300 బస్సుల కాంట్రాక్ట్ను హైదరాబాద్కు చెందిన సంస్థ దక్కించుకుంది. ఈ ఎలక్ట్రికల్ బస్సుల కోసం టీఎస్ఆర్టీసీ సుమారు రూ.400 కోట్లను వెచ్చించనుంది.కొత్త బస్సులు వస్తే కాలం చెల్లిన బస్సులను తొలగిస్తామని టీఎస్ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. వారం రోజుల్లోగా కొత్త బస్సుల కొనుగోలుకు కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని తెలిపారు.